రేమద్దుల లో మార్చ్ 23 న యువ నాయకులు, యువకులు భగత్ సింగ్ విగ్రహానికి పుష్పగుచ్ఛము వేసి జోహార్లు అర్పించారు.స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖఃదేవ్, రాజగురులు దేశం కోసం అమరులైన రోజున అమరవీరుల దినం జరుపుకోవడం జరిగినది. భగత్సింగ్ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. భగత్సింగ్ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు. 'ఇంక్విలాబ్-జిందాబాద్' అని వారు ఇచ్చిన నినాదం యావత్ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి. వారి స్ఫూర్తితో సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, మానవత్వం, మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి.
No comments:
Post a Comment