Thursday, March 7, 2019

అట్టహాసంగా... రేమద్దుల లో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు...

వివిధ జిల్లాల నుండి 11 ఎద్దుల జతలు పాల్గొన్నాయి.
మహాశివరాత్రి సందర్భంగా రేమద్దుల లో రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో బండలాగుడు  పోటీలు 05.03.2019 నిర్వహించారు. రేమద్దుల సర్పంచ్ మంజుల తిరుపతయ్య గారు ప్రారంభించారు.
 ఈ పోటీలలో గద్వాల జిల్లా శ్రావణ గండ్ల చక్రధర్ గౌడ్ ఎద్దులు 3927 ఫీట్లు లాగి మొదటి బహుమతి పొందాయి. గద్వాల జిల్లా ఇందువాసి వీరేశం గౌడ్ ఎద్దులు 3750 ఫీట్లు లాగి రెండో బహుమతి పొందాయి. నాగర్ కర్నూల్ జిల్లా చంద్రకల్ వెంకటేశ్వరరావు చెందిన ఎద్దులు 3582 ఫీట్లు లాగి మూడో స్థానం గెలుచుకున్నాయి. 
ఈ పోటీలలో ఉపసర్పంచి రాంబాబు, రైతు మిత్ర సభ్యులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




No comments:

Post a Comment